China: మలేషియాలో కరోనా వైరస్ సోకి భారతీయ యువకుడి మృతి

  • జీవనోపాధి కోసం మలేషియా వెళ్లిన త్రిపుర వాసి 
  • ఆసుపత్రిలో మానీర్ హోస్సేన్ (23) మృతి
  • భారత్‌కు తీసుకురావాలని కోరుతోన్న కుటుంబ సభ్యులు

చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. జీవనోపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ భారతీయుడు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను భారత్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

త్రిపురలోని పూర్తాల్ రాజ్ నగర్ గ్రామానికి చెందిన మానీర్ హోస్సేన్ (23) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడే ఓ రెస్టారెంట్ లో పని చేసుకుంటున్న ఆయనకు కరోనావైరస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే, ఆయన మృతి చెందినట్లు అక్కడి అధికారులు ఆయన తాత అబ్దుల్ రహీంకు సమాచారం ఇచ్చారు. కాగా చైనాలో ఈ వైరస్ ఇప్పటికే  170 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.

More Telugu News