Crime News: 'సమత హత్యాచారం' కేసు తీర్పు.. నేరం రుజువైందన్న న్యాయమూర్తి.. బోరున విలపించిన దోషులు!

  • చివరిగా చెప్పుకునేది ఏమైనా ఉందా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి
  • కోర్టు వద్ద భద్రత పెంచిన పోలీసులు
  • కోర్టుకు చేరుకున్న సమత కుటుంబ సభ్యులు

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో నిందితులు నేరం చేసినట్టు రురుజువైందని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో ఈ నెల 27నే తీర్పు వెల్లడి కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండడంతో తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.  

లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో సమత హత్యాచారం ఘటన చోటుచేసుకుంది. సమతను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ పూర్తయింది. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సేవాధికార సంస్థ తరఫున కోర్టు న్యాయవాదిని సమకూర్చింది.

ఈ కేసులో నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్‌ లను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. అలాగే, సమత కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానానికి చేరుకున్నారు. న్యాయస్థానం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు మొత్తం 25 మంది సాక్షులను విచారించింది.

తుది తీర్పు నేపథ్యంలో నిందితులను న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. నేరం రుజువైందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో నిందితులు న్యాయమూర్తి ముందు బోరున విలపించారు. కాసేపట్లో దోషులకు శిక్ష విధించనున్నారు.

More Telugu News