English medium: ఏపీలో ఆంగ్ల మాధ్యమంపై కర్ణాటక మంత్రి లేఖ

  • ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పుబట్టిన కర్ణాటక మంత్రి 
  • దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది అని లేఖ 
  • భాషావేత్తల్లో ఇంగ్లీషుపై ఇప్పటికే వ్యతిరేకత

ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై పొరుగు రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్ణాటక మంత్రి సురేష్ కుమార్ ఆయనకు లేఖ రాశారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ముఖ్యంగా సరిహద్దుల్లో విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ భాషావేత్తలు, మాతృభాషాభిమానుల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

More Telugu News