India: మైదానంలో 'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదించిన న్యూజిలాండ్ అభిమాని.. వీడియో వైరల్

  • రెండో టీ20 మ్యాచ్‌లో ఘటన
  • తనకు ఈ నినాదాన్ని నేర్పించాలని అడిగిన న్యూజిలాండ్ అభిమాని
  • నేర్పించిన భారతీయులు

న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో నిన్న జరిగిన టీమిండియా, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. చివరకు విజయం భారత్‌నే వరించింది. అంతకు ముందు ఆక్లాండ్‌లో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే, ఆక్లాండ్‌ మైదానంలో రెండో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో మైదానంలో టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున 'భారత్‌ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో ఓ న్యూజిలాండ్ అభిమాని  కూడా 'భారత్‌ మాతా కీ జై' అంటూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. 'భారత్‌ మాతా కీ జై' అనే నినాదాన్ని తనకు నేర్పించాలని కివీస్ అభిమాని భారతీయులను అడిగాడు. దీంతో అతడికి ఈ నినాదం ఎలా పలకాలన్న విషయాన్ని భారతీయులు నేర్పించారు. దీంతో అతడు 'భారత్‌ మాతా కీ జై' అని నినదించాడు. 

More Telugu News