Nirbhaya: రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన నిర్భయ దోషి వినయ్ శర్మ

  • నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి
  • ఉరి తప్పించుకునేందుకు వినయ్ శర్మ చివరి ప్రయత్నం
  • రాష్ట్రపతి క్షమాభిక్ష కోరినట్టు వినయ్ శర్మ న్యాయవాది వెల్లడి

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఉరి నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. వినయ్ శర్మ న్యాయవాది ఈ విషయం తెలియజేశారు. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులు నలుగుర్నీ ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో ఉరితీత మరోసారి ఆలస్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News