Abortions: అబార్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

  • ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికే అబార్షన్లు చేయించుకునే అవకాశం
  • పరిమితిని 24 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  • పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందన్న జవదేకర్

గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు... ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని... ఈ నేపథ్యంలో అబార్షన్ కు నాలుగు వారాల గరిష్ట పరిమితిని పెంచడం వారి హక్కులను కాపాడటమేనని చెప్పారు.

More Telugu News