Rohit Sharma: రోహిత్ శర్మ హిట్... మూడో టి20లో టీమిండియా 179/5

  • టీమిండియా, కివీస్ మధ్య హామిల్టన్ లో మూడో టి20
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆతిథ్య జట్టు
  • రాణించిన రోహిత్, రాహుల్, కోహ్లీ

న్యూజిలాండ్ తో మూడో టి20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి రెండు టి20ల్లో విఫలమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో బ్యాట్ ఝళిపించాడు. కేవలం 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 27 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హామిష్ బెన్నెట్ 3 వికెట్లు తీయగా, శాంట్నర్, గ్రాండ్ హోమ్ చెరో వికెట్ పడగొట్టారు.

More Telugu News