Saina Nehwal: రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సైనా నెహ్వాల్.. ఏ పార్టీలోకి అంటే..!

  • సంచలన నిర్ణయం తీసుకున్న సైనా
  • బ్యాడ్మింటన్ కోర్టు నుంచి ప్రజాక్షేత్రం దిశగా అడుగులు
  • బీజేపీలో చేరనున్న ఏస్ టెన్నిస్ స్టార్

భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం క్రీడాకారిణిగా దేశం కోసం శ్రమించిన సైనా... ఇకపై ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోంది. త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతోంది.

ఈరోజు ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోబోతోంది. 29 ఏళ్ల సైనా ముందు నుంచి కూడా బీజేపీ మద్దతుదారుగానే ఉంది. తన కెరీర్ లో 24 ఇంటర్నేషనల్ టైటిల్స్ ను సైనా గెలుచుకుంది. 2009లో ప్రపంచ నెంబర్ టూ స్థానంలో కొనసాగిన సైనా... 2015లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా మెడల్స్ ను సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఆమె 9వ స్థానంలో కొనసాగుతోంది. 2018లో ఆమె మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడింది.

ప్రధాని మోదీని సైనా గతంలో అనేక సార్లు కలుసుకుంది. ఇంత కాలం బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన సైనా ఇకపై రాజకీయాల్లో తనదైన ముద్రను వేయబోతోంది.

More Telugu News