Krish: వరుణ్ తేజ్ ను కూడా లైన్లో పెట్టేసిన క్రిష్

  • పవన్ తో క్రిష్ మూవీ
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ 
  • వరుణ్ తేజ్ తో రెండో మూవీ చేయనున్న క్రిష్ 

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేయడానికి దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగాడు. మొఘల్ రాజుల కాలం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఒక 'దొంగ'గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రానికి ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిపెట్టుకున్న క్రిష్, చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసే ఆలోచనలో వున్నాడని అంటున్నారు.

ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా క్రిష్ లైన్లో పెట్టేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కంచె' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. అందువలన క్రిష్ వినిపించిన కథకి వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News