Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్ కు భద్రత పెంపు

  • సీజేఐ జస్టిస్ బోబ్డే, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మరింత భద్రత
  • జడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత  
  • ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు భద్రత పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా సంస్థల నివేదిక ఆధారంగా వారి భద్రతను పెంచుతూ హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం మేరకు బోబ్డే, ఓం బిర్లాకు జడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News