Chandrababu: అందుబాటులో ఉన్న నేతలంతా రండి: చంద్రబాబు ఆదేశం

  • కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి
  • ప్రత్యేక సమావేశం ఏర్పాటు
  • పార్టీ నేతలకు వర్తమానం

విజయవాడ సమీపంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలంతా తక్షణమే తన వద్దకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ఆదేశించారు. రాజధాని వ్యవహారం, మండలి రద్దు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై తక్షణం చర్చించి, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన కారణంగా ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం నుంచి పార్టీ నేతలకు వర్తమానం అందింది. ఇదే సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపైనా చర్చ ఉంటుందని సమాచారం. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News