Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం... 83 మంది మృతి?

  • ఘజ్నీ ప్రావిన్స్ లో కుప్పకూలిన విమానం
  • విమానం కూలిన ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం
  • విమాన ప్రమాదంపై సందేహాలు

ఇటీవల ఇరాన్ లో విమానం కుప్పకూలిన ఘటన మరువక ముందే ఆఫ్ఘనిస్థాన్లో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ విమానంలో 83 మంది ప్రయాణికులుండడంతో వారంతా మరణించి వుంటారని భావిస్తున్నారు. అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ బోయింగ్ విమానం ఘజ్నీ ప్రావిన్స్ లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో విమాన ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక తాలిబాన్ల దాడి ఫలితమా? అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది.

More Telugu News