Sharwanand: ఫస్టులుక్ తోనే అదరగొట్టేస్తున్న శర్వానంద్

  • కొత్త దర్శకుడితో శర్వానంద్ 'శ్రీకారం'
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ 
  • వేసవి సెలవుల్లో విడుదల

శర్వానంద్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జాను' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాగా ఆయన చేస్తున్న 'శ్రీకారం' కూడా సెట్స్ పైనే వుంది. రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మిసున్న ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్ ను వదిలారు. లుంగీ పైకి కట్టి .. భుజంపై నల్ల తువ్వాలు వేసుకుని పొలం పనుల్లో వున్నట్టుగా ఈ పోస్టర్లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. 'శతమానం భవతి' తరువాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఇది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.

More Telugu News