Prabhas: భారీ సెట్లో 'జాన్' చేసిన సీన్స్ బాగా వచ్చాయట

  • పునర్జన్మల నేపథ్యంలో 'జాన్'
  • 3 కోట్లతో నిర్మించిన సెట్లో చిత్రీకరణ 
  • అవుట్ పుట్ బాగా వచ్చిందన్న దర్శకుడు  

ప్రభాస్ తాజా చిత్రం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. 'సాహో'లో యాక్షన్ హీరోగా సందడి చేసిన ప్రభాస్, 'జాన్' సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది.

3 కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నిన్నటితో ఆ షెడ్యూల్ పూర్తయింది. ఈ సెట్లో చిత్రీకరించిన సన్నివేశాలకి సంబంధించిన అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చాలా హ్యాపీగా వున్నాడట. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీలోను విడుదల చేయనున్నారు.

More Telugu News