Telangana: వలసలు ప్రారంభం.. టీఆర్ఎస్ కండువా కపుకున్న ’కాంగ్రెస్’ కార్పొరేటర్

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వలసలు
  • బడంపేట్ 31వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ చిరుగింత
  • ఆమెకు టీఆర్ఎస్ కండువా కప్పిన మంత్రి సబిత

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ లోకి వలసల పర్వం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరారు.

More Telugu News