Krishna Water: మూడో దశ కృష్ణా పైపులైనుకు భారీగా లీకేజీలు... హైదరాబాదులో నిలిచిపోనున్న తాగునీటి సరఫరా!

  • ఈ నెల 29న హైదరాబాదులో నీటి సరఫరాకు అంతరాయం
  • లీకేజీలకు మరమ్మతులు చేస్తున్న అధికారులు
  • ఒకరోజు పాటు సరఫరా నిలిపివేయనున్న జలమండలి

హైదరాబాద్ నగర మంచినీటి అవసరాలు తీర్చుతున్న మూడో దశ కృష్ణా పైపులైనుకు భారీగా లీకేజీలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఈ నెల 29 నుంచి హైదరాబాదులోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలకు తరలివెళ్లిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. ఈ నెల 29 ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు.

More Telugu News