Andhra Pradesh: రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం?

  • సచివాలయంలోని 1వ బ్లాక్ లో నిర్వహించనున్న సమావేశం
  • మండలి రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • ఆ తర్వాత తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే యోచన

రేపు ఉదయం తొమ్మిది గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ఈ సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశంలో శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

More Telugu News