Vijay Sai Reddy: రాష్ట్రాల ప్రతిపక్ష నేతలకు ఎవరైనా ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు ఆఖరిస్థానం కూడా దొరకదు: విజయసాయి

  • చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
  • కనీసం ఒక అజెండా కూడా లేదని వ్యాఖ్యలు
  • రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తాడంటూ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు చివరిస్థానం కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక అజెండా లేదు, ప్రజాసమస్యలపై గళమెత్తిన సందర్భంలేదని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలేశాడని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News