krishnam raju: సీనియర్ నటుడు కృష్ణంరాజు బర్త్ డే.. బీజేపీ నేతలకు విందు!

  • గత సోమవారం 80వ పుట్టినరోజును జరుపుకున్న కృష్ణంరాజు
  • హాజరైన పలువురు సినీ ప్రముఖులు
  • పార్టీకి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేతలకు విందు ఇచ్చారు. ఈ పార్టీకి నటుడు ప్రభాస్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరై కృష్ణంరాజుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మరోమారు కేక్ కట్ చేసిన కృష్ణంరాజు బీజేపీ నేతలకు తినిపించారు.

కృష్ణంరాజు గత సోమవారమే 80వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు నటుడు ప్రభాస్, మోహన్‌బాబు, చిరంజీవి, మంచులక్ష్మి, విష్ణు తదితరులు హాజరయ్యారు. తాజాగా, బీజేపీ నేతలతో కలిసి మరోమారు ఆయన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

More Telugu News