BJP: ఇంత ఖరీదైన ఎన్నికలు తెలంగాణ ప్రజలు చూడలేదు: టీ-బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

  • అధికార అక్రమార్కుల అక్రమాలు ప్రజలు గమనించాలి
  • అక్రమాలు జరిగినా బీజేపీ మంచి ఫలితాలు సాధించింది
  • మూడు మున్సిపాల్టీలలో సొంతంగా గెలిచాం

ఇంత ఖరీదైన ఎన్నికలను తెలంగాణ ప్రజలే కాదు యావత్తు దేశ ప్రజలు ఎక్కడా చూడలేదని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార అక్రమార్కులు ఏ విధంగా అక్రమాలు చేశారో తెలంగాణ ప్రజలు గమనించారని అన్నారు.

 ఈ ఎన్నికల్లో ఇన్ని అక్రమాలు జరిగినప్పటికీ తాము మంచి ఫలితాలను సాధించామని, మూడు మున్సిపాల్టీలలో సొంతంగా గెలిచామని, కొన్ని మున్సిపాల్టీలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారామని చెప్పారు. దొడ్డిదారిన నెగ్గే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి  ఎంత దయనీయంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 120 మున్సిపాల్టీలలో నాలుగైదింటిని మినహాయిస్తే మిగిలిన చోట్ల బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News