Nara Lokesh: ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు: తెనాలి దాడులపై స్పందించిన లోకేశ్

  • తెనాలిలో రైతుల దీక్ష శిబిరంపై దాడి
  • శిబిరానికి నిప్పుపెట్టిన వైసీపీ కార్యకర్తలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్

తెనాలిలో రైతుల దీక్ష చేస్తుండగా ఆ శిబిరానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడని మండిపడ్డారు. రైతులపై దాడి చేయించిన వైఎస్ జగన్ రైతు ద్రోహిగా మరింత దిగజారారని వ్యాఖ్యానించారు.

 మూడు రాజధానుల అంశంలో జగన్ స్వార్థం తప్ప మరేమీ లేదన్న విషయం ప్రజలకు అర్థమైందనే ఆందోళన జగన్ ను వెంటాడుతోందని ట్వీట్ చేశారు. ఈ కారణంగానే రౌడీలను రంగంలోకి దించి తెనాలిలో శాంతియుతంగా రైతులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారని, జేఏసీ శిబిరానికి నిప్పంటించారని మండిపడ్డారు. జగన్ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని, రైతులపై చేయి వేసిన వాళ్లు నాశనం అయిపోతారన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలని లోకేశ్ హెచ్చరించారు.

More Telugu News