Bhainsa: భైంసా మున్సిపాలిటీలో బోణీ కొట్టలేకపోయిన టీఆర్ఎస్!

  • అక్కడ ఎంఐఎందే ఆధిక్యం..15 వార్డుల్లో విజయం
  • బీజేపీకి 9 స్థానాలు, ఇతరులకు 2 స్థానాలు
  • చతికిలపడ్డ కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోన్న టీఆర్ఎస్ భైంసా మున్సిపాలిటీలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండు పార్టీలు కనీసం ఒక్క వార్డును సైతం దక్కించుకోలేకపోయాయి. నిర్మల్ జిల్లాకు చెందిన భైంసా మున్సిపల్ ఎన్నిల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీచేసినప్పటికీ.. ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యే జరిగింది.
 
ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంఐఎం, బీజేపీలు ప్రచారం సందర్భంగా తీవ్రంగా కృషిచేశాయి.  భైంసాలో మొత్తం 26 వార్డులుండగా అందులో ఎంఐఎంకు 15 స్థానాలు దక్కగా, బీజేపీ 9 వార్డుల్లో గెలుపొందింది. కాగా స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు.

More Telugu News