Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం... ముగ్గురి మృతి

  • అదుపుతప్పిన అంబులెన్స్
  • డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం
  • మరో వ్యక్తి పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఓ అంబులెన్స్ రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వేగంగా వెళ్లే క్రమంలో అంబులెన్స్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

More Telugu News