Nara Lokesh: సాక్షిపై రూ. 75 కోట్లకు నారా లోకేశ్ పరువునష్టం దావా

  • 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' పేరుతో సాక్షిలో కథనం
  • విశాఖ జిల్లా జడ్జి కోర్టులో లోకేశ్ పరువునష్టం దావా
  • తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనం ఉందని ఆరోపణ

సాక్షి దినపత్రికపై టీడీపీ నేత నారా లోకేశ్ రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ ఉదయం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' అనే శీర్షకతో గత ఏడాది అక్టోబర్ 22న సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్... సాక్షిపై పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వ్యాజ్యం దాఖలైంది.

More Telugu News