Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అదనపు శాఖల కేటాయింపు

  • ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి
  • అదనంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల కేటాయింపు
  • సీఎంకు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా వున్న ఆయనకు అదనంగా  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు చేసింది. విషయం తెలిసిన మంత్రి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు. తనపై నమ్మకంతో అదనపు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రికి గౌతంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  

More Telugu News