Chevireddy: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా

  • చెన్నై వెళ్తుండగా ఘటన
  • పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద ప్రమాదం
  • ప్రమాదం నుంచి తప్పించుకున్న చెవిరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెన్నై వెళ్తుండగా ఆయన ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ సమయంలో చెవిరెడ్డి ఎస్కార్ట్ వాహనానికి ముందు ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం  పరమేశ్వర మంగళం వద్ద జరిగిన ఈ ఘటనలో కారులోని సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.  వెంటనే వారిని తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News