nitin: నాలుగేళ్లుగా ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో నితిన్.. త్వరలో పెళ్లి

  • యూకేలో ఎంబీఏ చదివిన శాలినిని పెళ్లాడనున్న నితిన్
  • వివాహానికి ఏర్పాట్లు.. ఏప్రిల్‌ 16న ముహూర్తం
  • దుబాయ్‌లోని ప్యాలసో వర్సేస్‌ హోటల్‌లో పెళ్లి?

నాలుగేళ్లుగా శాలిని అనే అమ్మాయితో సినీనటుడు నితిన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. వారిద్దరి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ ఏడాది ఏప్రిల్‌ 16న వివాహ ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం.

వధువు శాలిని.. యూకేలో ఎంబీఏ చేసింది. వారిద్దరి పెళ్లి పనులని నిర్మాత, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటోందని తెలిసింది. వీరిద్దరి పెళ్లికి దుబాయ్‌లోని ప్యాలసో వర్సేస్‌ హోటల్‌ వేదిక కానుంది. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో బంధుమిత్రులకు విందు ఇవ్వనున్నారట. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

More Telugu News