Roja: కేన్సర్ నిర్ధారణకు ఉచిత పరీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

  • స్విమ్స్ ఆధ్వర్యంలో కేన్సర్ నిర్ధారణ పరీక్షలు
  • పింక్ బస్సు లో ఈ కార్యక్రమం ప్రారంభం
  • నలభై సంవత్సరాలు పైబడిన మహిళలకు పరీక్షలు

మహిళలకు ఉచితంగా నిర్వహించే కేన్సర్ నిర్ధారణ పరీక్షలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని గోపాలకృష్ణపురంలో ఉన్న ఎస్టీ కాలనీలో తిరుపతి స్విమ్స్ పింక్ బస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నలభై సంవత్సరాలు పైబడిన మహిళలకు స్విమ్స్ మహిళా వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

More Telugu News