Cheating: ఎల్బీనగర్ లో ఘరానా మోసగాడి అరెస్టు

  • రాజకీయనాయకుడిని అంటూ మోసాలు 
  • ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తూ అక్రమార్జన
  • నిందితుడు పురుషోత్తంను అరెస్టు చేసిన పోలీసులు

రాజకీయ నాయకుడిని అంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని హైదరాబాద్, ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మాడల పురుషోత్తం ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇతను ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతుండగా అడ్డుకున్న ఘటనలో బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని ఇటీవల  బెదిరించాడు. అర్ధరాత్రి పెట్రోల్ బాటిల్ తో శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడికి యత్నించాడు. గతంలో ఇతను రాజకీయ నేతలు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించిన ఘటనలు ఉన్నాయి. ఇతను వనపర్తి జిల్లా ఖిలా ఘన్ పూర్ మండలం వెంకటంపల్లికి చెందిన వ్యక్తి అని పోలీసుల సమాచారం.

More Telugu News