T20: సుదీర్ఘమైన కివీస్ పర్యటనకు టాస్ గెలుపుతో శ్రీకారం చుట్టిన టీమిండియా

  • నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టి20
  • ఆక్లాండ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కివీస్ పర్యటనలో భాగంగా తొలి టి20 మ్యాచ్ కు సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా జరిగే ఈ టి20 పోరులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. యువకులతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా కఠినమైన న్యూజిలాండ్ పర్యటనను సానుకూల దృక్పథంతో ఆరంభించాలని తలపోస్తోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 5 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఇక్కడి వాతావరణం పర్యాటక జట్లకు సవాల్ గా నిలుస్తుందన్న నేపథ్యంలో కీలకమైన టాస్ గెలిచి టీమిండియా సుదీర్ఘ పర్యటనకు ఆశావహదృక్పథంతో శ్రీకారం చుట్టింది.

More Telugu News