Andhra Pradesh: ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా.. మండలి అంశంపై ఆ రోజు చర్చకు స్పీకర్ అనుమతి!

  • ‘మండలి’ అంశంపై సుదీర్ఘ చర్చకు అనుమతిస్తున్నా
  • సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉందాం
  • సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా: స్పీకర్ 

ఏపీ శాసనమండలిని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై సీరియస్ గా చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని ఈరోజు అసెంబ్లీలో  సీఎం జగన్ తనను కోరడంపై స్పీకర్ తమ్మినేని స్పందించారు. ఈ అంశంపై సోమవారం నాడు సుదీర్ఘంగా చర్చిద్దామని, సభ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉందామని అన్నారు. శాసనసభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తమ్మినేని ప్రకటించారు.

More Telugu News