Kodali Nani: నారా లోకేశ్ కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే!: కొడాలి నాని కొత్త లాజిక్

  • లోకేశ్ లాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎప్పుడు రావాలి? 
  • మంత్రులు ఎప్పుడు కావాలి?
  • చంద్రబాబు తన కొడుకును ఏం చేయాలేకపోయారు!

నూట యాభై కిలోల బరువు ఉంటే ఆయన పెద్దాయన అని, అది ‘పెద్దల సభ’ అని టీడీపీ నాయకులు అనుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు విసిరారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఒకరకంగా చెప్పాలంటే నారా లోకేశ్ కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని చమత్కరించారు.

లోకేశ్ లాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎప్పుడు రావాలి? మంత్రులు ఎప్పుడు కావాలి? అని ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేశారని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌన్సిల్ ను మళ్లీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో పనికిమాలిన వాళ్లందరినీ మండలిలో పెట్టేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనుక కౌన్సిల్ ను తిరిగి ఏర్పాటు చేయకపోతే నారా లోకేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ అవుతాడా? మంత్రి అయ్యేవాడా? అంటూ కొడాలి కొత్త లాజిక్ తీస్తూ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్ ను ఏం చేయలేకపోయారని విమర్శించారు.

More Telugu News