kangana ranaut: నిర్భయ దోషులను క్షమించాలా? అసలు నీలాంటి వారిని జైల్లో పెట్టాలి: కంగనా రనౌత్

  • నిర్భయ దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్ ఇటీవల వ్యాఖ్యలు
  • మండిపడ్డ కంగనా రనౌత్
  • హంతకులపైన ప్రేమ, జాలి ఎలా పుట్టుకువస్తాయని విమర్శ

సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ విమర్శలు గుప్పించారు. ఉరికంబం ఎక్కబోతున్న 'నిర్భయ' దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్‌ నిర్భయ తల్లిదండ్రులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇందిరా జైసింగ్ లాంటి మహిళలను నిర్భయ దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేస్తేనే అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆమె చెప్పారు. దారుణాలకు పాల్పడిన దోషులు, హంతకులపైన ప్రేమ, జాలి ఎలా పుట్టుకువస్తాయి? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారని మండిపడ్డారు. నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీయనున్న విషయం తెలిసిందే.

More Telugu News