jharkhand: ఉద్యమాన్ని వ్యతిరేకించారని.. ఏడుగురి దారుణహత్య!

  • ఝార్ఖండ్‌లో దారుణం
  • పత్తల్‌గఢీ ఉద్యమ సభను వ్యతిరేకించడంతో కిడ్నాప్
  • గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపిన ఉద్యమకారులు

పత్తల్‌గఢీ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఏడుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఝార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని బురుగులికేరా గ్రామంలో పత్తల్‌గఢీ ఉద్యమానికి సంబంధించి మంగళవారం రాత్రి సభ జరిగింది. ఈ సభపై గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం సభను వ్యతిరేకించిన ఏడుగురు గ్రామస్థులను కిడ్నాప్ చేసిన ఉద్యమకారులు వారిని గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ హత్యలపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ సీరియస్ అయింది. హత్యలపై పరిశీలనకు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

More Telugu News