Kanna Lakshminarayana: ఇకపై ఏ అంశంపైన అయినా నిరసనలు, ఆందోళనలు బీజేపీ-జనసేన కలిసే చేస్తాం: కన్నా లక్ష్మీనారాయణ

  • కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం
  • ప్రతి 15 రోజులకోసారి సమావేశాలు నిర్వహించుకుంటాం
  • తొలి సమావేశం ఈ నెల 28న విజయవాడలో

బీజేపీ, జనసేన పార్టీల కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతి పదిహేను రోజులకొకసారి సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను బీజేపీ-జనసేన నేతలు కలిసిన తర్వాత ఈరోజు రాత్రి ఏడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, కోఆర్డినేషన్ కమిటీలు ప్రకటించిన తర్వాత తొలి సమావేశం ఈ నెల 28న విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై ఏ అంశంపైన అయినా నిరసనలు, ఆందోళనలు చేసిన రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు.

More Telugu News