Andhra Pradesh: మూడు రాజధానుల విఫలయత్నం ఏపీ అవకాశాలను కూడా దెబ్బతీస్తుంది: చంద్రబాబు

  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
  • మూడు రాజధానుల అంశాన్ని ఓ వైఫల్యంగా పేర్కొన్న చంద్రబాబు
  • ట్వీట్ చేసిన టీడీపీ అధినేత

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఓ వైఫల్యంగా పేర్కొన్న చంద్రబాబు, ఈ విఫలయత్నం పాలనాపరమైన సంక్షోభాన్ని కలిగించడమే కాకుండా, పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవకాశాలను చంపేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా కాలేజీల నుంచి ఉత్తీర్ణులై వచ్చే లక్షల మంది యువతీయువకుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News