Andhra Pradesh: 'ఇన్ సైడర్' అక్రమాలపై దర్యాప్తు తీర్మానం ఆమోదం పొందింది.... ఇక బాబు అక్రమాలు బయటికొస్తాయి: విజయసాయి

  • ట్విట్టర్ లో వెల్లడించిన విజయసాయి
  • చంద్రబాబు ఓ ద్రోహి అంటూ విమర్శలు
  • చట్టానికి ఎవరూ అతీతులు కాలేరంటూ వ్యాఖ్యలు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు కోసం అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాల్పడిన అక్రమాలన్నీ ఈ దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని తెలిపారు.

రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు రహస్య అజెండా, కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు, స్వార్థ ప్రయోజనాలు అన్నీ బయటికి వస్తాయని విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు ఓ ద్రోహి అని, తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

More Telugu News