Tihar: ఈ నెల 30న తీహార్‌ జైలుకు చేరుకోనున్న తలారి పవన్ జల్లాద్

  • ‘నిర్భయ’ దోషులకు వచ్చే నెల 1న ఉరి 
  • ఆరోజు ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలు
  • అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు  

నిర్భయ కేసులో నలుగురు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు వచ్చే నెల 1వ తేదీన ఉరిశిక్ష అమలు కానున్న విషయం తెలిసిందే. ఆరోజు ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నలుగురిని ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి తలారి పవన్ జల్లాద్ అక్కడికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.  

More Telugu News