High Court: కాసేపట్లో ఏపీ రాజధానులపై హైకోర్టులో విచారణ

  • రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ 37 మంది రైతుల పిటిషన్లు 
  • సీఆర్‌డీఏకి అభిప్రాయాలు తెలపడానికి గడువును పెంచాలన్న రైతులు
  • అమరావతి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌పై పిటిషన్లు 

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయానికి సంబంధించి ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ 37 మంది రైతులు పిటిషన్లు వేశారు.

అలాగే సీఆర్‌డీఏకి రైతులు తమ అభిప్రాయాలు తెలపడానికి ఇచ్చిన గడువును పెంచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమలును సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు. సీఆర్‌డీఏ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా పిటిషన్ వచ్చింది.

More Telugu News