Telugudesam: టీడీపీ ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

  • సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఘటన
  • వాహనాలకు ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేవని అడ్డుకున్న పోలీసులు
  • వాహనాల్లో మేమే ఉన్నప్పుడు స్టిక్కర్లు ఎందుకంటూ ఎమ్మెల్సీల ఆగ్రహం

శాసనమండలి సమావేశాలకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. శాసనమండలికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలపై ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేకుండా ఎలా వస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఎమ్మెల్సీలే వాహనాల్లో ఉంటే స్టిక్కర్లు ఎందుకని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాదోపవాదాలు జరిగియి. కాసేపటి తర్వాత ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం శాసనసభ, మండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.

More Telugu News