Marriage: ఇదో విచిత్రం.. వధువు తల్లితో వరుడి తండ్రి జంప్!

  • గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఘటన
  • ఫిబ్రవరిలో పిల్లల పెళ్లికి ఏర్పాట్లు
  • అంతలోనే పరారైన వధువు తల్లి, వరుడి తండ్రి

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ. పిల్లల పెళ్లికి ముందు వధువు తల్లి, వరుడి తండ్రి జంపైపోయారు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. కాటర్గామ్ ప్రాంతానికి చెందిన యువకుడికి నవ్సారీ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి. అయితే, సరిగ్గా అప్పుడే జరిగిందో విస్తుపోయే సంఘటన.

వధువు తల్లి అదృశ్యమైంది. ఆమె కనిపించకుండా పోవడంతో అందరూ ఆమె కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వరుడి తండ్రి కూడా కనిపించకుండా పోయాడు. వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆరా తీయగా తెలిసిందేమిటంటే.. వారిద్దరూ కలిసి జంపైపోయారని. వారిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా, వారిద్దరూ పరారు కావడంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది.

More Telugu News