Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హారర్ మూవీలో రాశిఖన్నా
  • వినాయక్ 'శీనయ్య' అప్ డేట్
  • తెలుగులోకి మరో కొరియన్ సినిమా

 *  అందాలతార రాశిఖన్నా తాజాగా ఓ హారర్ మూవీలో నటించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి 'అరణ్మనై' హారర్ చిత్రాల సీరీస్ లో మూడవ భాగాన్ని చేయనున్నారు. ఇందులో రాశిఖన్నా కథానాయికగా ఎంపికైంది.  
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'శీనయ్య' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును ఈ నెల 27 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ఇందులో వినాయక్ మెకానిక్ గా కనిపిస్తాడు.
*  సమంత కథానాయికగా ఆమధ్య వచ్చిన 'ఓ బేబీ' చిత్రం ఓ కొరియన్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొరియన్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శకుడు సుధీర్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.

More Telugu News