Varun Tej: వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వరుణ్ తేజ్

  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • ప్రతినాయకుడి పాత్రలో సునీల్ శెట్టి
  • వచ్చేనెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్  

విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ, విజయాలను అందుకుంటూ వరుణ్ తేజ్ ముందుకెళుతున్నాడు. 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' సినిమాలతో విజయాలను అందుకున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేయనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, వచ్చేనెల 17వ తేదీ నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది.

అల్లు బాబీ - సిద్ధూ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కనిపించనున్నాడు. కొన్ని నెలలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని మరీ, ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొననున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన జోడీ కట్టే కథానాయికల విషయంలో క్లారిటీ రావలసి వుంది.

More Telugu News