VH: మూడు రాజధానుల నిర్ణయం హాస్యాస్పదం: వీహెచ్

  • దేశంలో ఎక్కడా మూడు రాజధానుల విధానం లేదు
  • ఏపీలో రాజధాని సమస్యపై కేంద్రం స్పందించాలి
  • ఏపీ ప్రత్యేక హోదాకే నిధులు లేవు
  • మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయి

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విధానంపై తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. ఈ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా కూడా మూడు రాజధానుల పద్ధతి లేదని ఎద్దేవా చేశారు.

వీహెచ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకే నిధులు లేవని.. ఇక మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సలహాతోనే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ రాజధానిపై నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

More Telugu News