Prabhas: 'జాన్' కోసం సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన ప్రభాస్

  • షూటింగు దశలో 'జాన్'
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • కీలకమైన పాత్రలో కృష్ణంరాజు

ప్రభాస్ తాజా చిత్రంగా 'జాన్' రూపొందుతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారనేది తాజా సమాచారం. దర్శకుడితో చెప్పి ఆ పాత్రను పవర్ఫుల్ గా రాయించడంలోను .. కృష్ణంరాజును ఒప్పించడంలోను ప్రభాస్ కీలకమైన పాత్రను పోషించాడని అంటున్నారు. అభిమానుల ముచ్చట తీర్చడం కోసమే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. గతంలో కృష్ణంరాజు - ప్రభాస్ కలిసి నటించిన 'బిల్లా' .. 'రెబల్' సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఆ సెంటిమెంట్ ను ప్రభాస్ ఎంత మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.

More Telugu News