Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ వద్దకు భారీగా చేరుకున్న అమరావతి రైతులు

  • మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన రైతులు
  • కాసేపట్లో పవన్‌తో రైతుల సమావేశం
  • ఏపీ ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి వివరించనున్న రైతులు

ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జి చేసిన తీరుతో పాటు పలు విషయాలపై వారు పవన్ కల్యాణ్‌కు తెలిపి, తమ తరఫున పోరాడాలని కోరనున్నారు. కాసేపట్లో రైతులతో పవన్ చర్చించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ తీసుకున్న రాజధాని నిర్ణయం వైసీపీ వినాశనానికి నాంది అని పవన్ నిన్న మండిపడ్డారు.

More Telugu News