Crime News: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడిని సీసాతో పొడిచి చంపిన యువకులు

  • కూకట్‌పల్లి పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని ఖైత్లాపూర్‌లో ఘటన
  • సుధీర్‌ అనే యువకుడు మృతి
  • మద్యం మత్తులో ఘటన

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని ఖైత్లాపూర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సుధీర్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గత అర్ధరాత్రి పార్టీ చేసుకున్నాడు. స్నేహితులంతా మద్యం మత్తులో ఉండి సుధీర్‌తో గొడవపడ్డారు. ఈ క్రమంలో అతడిని స్నేహితులు మద్యం సీసాతో పొడిచి పారిపోయారు. దీంతో సుధీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News