Mahesh Babu: 10 రోజుల్లో 101 కోట్ల షేర్ .. తెలుగు రాష్ట్రాల్లో మహేశ్ దూకుడు

  • సంక్రాంతి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'
  • నైజామ్ లో అత్యధిక వసూళ్లు 
  • హైలైట్ గా నిలిచిన దేవిశ్రీ సంగీతం

మహేశ్ బాబు నుంచి ఇటీవల వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్ ను .. ఎమోషన్ ను టచ్ చేస్తూ వినోదభరితంగా సాగిన ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఈ సినిమా 101.97 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఒక్క నైజాంలోనే ఈ సినిమా 33 కోట్ల షేర్ ను సాధించి, మహేశ్ కెరియర్లో నైజామ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసింది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా లాభాల బాటలో పరుగులు తీస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ .. మహేశ్ మార్క్ యాక్షన్ .. విజయశాంతి వైపు నుంచి ఎమోషన్ .. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News