Gujarat: 8వ తరగతి విద్యార్థితో ఉపాధ్యాయురాలు జంప్!

  • గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఘటన
  • తన కుమారుడికి ప్రేమ పాఠాలు వల్లించిందని పోలీసులకు ఫిర్యాదు
  • గాలిస్తున్న పోలీసులు

8వ తరగతి విద్యార్థితో ప్రేమలో పడిన 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు అతడితో కలిసి జంపైపోయింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూలుకెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తండ్రి అసలు విషయం తెలిసి షాకయ్యాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్కూల్లో తన కుమారుడికి పాఠాలు చెప్పకుండా మాయమాటలు చెప్పి, ప్రేమ పాఠాలు వల్లించి టీచర్ తన కుమారుడిని వలలో వేసుకుందని బాలుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏడాదిగా ఈ తతంగం నడుస్తున్నా తను గుర్తించలేకపోయానని వాపోయాడు. వారిద్దరినీ పట్టుకుని తన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News