Jagan: ఇంకా ఆ పెద్ద మనిషికి ఎంత సమయం కావాలి?: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • ఆ పెద్దమనిషి ఇంకా ఎంత సేపు మాట్లాడతారో అడగండి
  • సమయం ఉంటే కేటాయించండి లేదంటే ఆపేసేయండి
  • స్పీకర్ తమ్మినేనికి జగన్ విజ్ఞప్తి

చంద్రబాబు మాట్లాడటం మొదలుపెట్టి యాభై నిమిషాలు అయిందని, ఇంకా, ఆ పెద్ద మనిషికి ఎంత సమయం కావాలని సీఎం జగన్ ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, ఆ పెద్దమనిషి ఇంకా ఎంత సేపు మాట్లాడతారో అడిగి, కేటాయించదగిన సమయం ఉంటే కేటాయించండి లేదంటే ఆపేసేయండి అంటూ స్పీకర్ తమ్మినేనికి విజ్ఞప్తి చేశారు. 21 మంది టీడీపీ సభ్యుల్లో 5 గురు మాట్లాడారని, 151 మంది ఉన్న తమ సభ్యుల్లో ఏడుగురు మాత్రమే మాట్లాడారని అన్నారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం పైనా చంద్రబాబుకు ప్రేమ లేదని, టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని విమర్శించారు.

More Telugu News